అందరికంటే ముందే ఎన్టీఆర్ అమెరికా నుంచి ఎందుకు వచ్చాడో తెలుసా?

by Dishanational2 |
అందరికంటే ముందే ఎన్టీఆర్ అమెరికా నుంచి ఎందుకు వచ్చాడో తెలుసా?
X

దిశ, వెబ్‌సెట్ : ఆస్కార్ అవార్డు వేడుకలకు అటెండ్ అయిన త్రిబుల్ ఆర్ టీం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో చాలా సందడి చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఇప్పటికీ, రామ్ చరణ్, కిరవాణీ, రాజమౌళి అక్కడే ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత త్వరగానే ఇండియాకు వచ్చేశాడు. దీంతో ఇది పలు అనుమానలకు తావిస్తుంది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోవిధంగా స్పందిస్తూ తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. అయితే అసలు విషయం తెలిశాక అందరూ సైలెంట్ అయ్యారు.

విషయంలోకి వెళ్తే.. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ సినిమాను ప్రారంభించాల్సి ఉంది. అందుకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేయడానికి, ఆయన ఈ సినిమా కోసం ఫోటోషూట్ నిర్వహించనున్నారు. అందుకే ముందుగానే హైదరాబాదులో ల్యాండ్ అయ్యాడని సమాచారం.

Read more:

మౌని‌కి చాలామందితో ఎఫైర్ ఉంది: ఉమైర్ సంధు

Next Story